- Advertisement -
యాదాద్రి భువనగిరి జిల్లా
Yadadri Bhuvanagiri District
ఇప్పటిదాకా ఇరవై కిడ్నీ సర్జరీలు
ఒక్కో సర్జరీకి 50 నుంచి 60 లక్షలు వసూలు
హైదరాబాద్
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకనంద ఆసుపత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి చికిత్స చేస్తున్నారన్న సమాచారం తో తనిఖీలు చేయటం జరిగిందని రాచకొండపోలీసు కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. 15 మంది నిందితుల్లో 9 మందిని అరెస్ట్ చేసి ఒక కారు. ఐదు లక్షల రూపాయల నగదు, పది మొబైల్స్ , సర్జికల్ కిట్ స్వాధీనం చేసుకున్నారు. సీపీ మాట్లాడుతూ అలకనంద ఆసుపత్రి ఓనర్ సుమంత్ ను అరెస్ట్ చేయటం జరిగినది. ఈ కిడ్నీ రాకెట్ లో డాక్టర్ అవినాష్ ప్రదాన పాత్ర . పోషిస్తున్నాడు. బయటి నుండి వైద్యులను తీసుకుని వచ్చి సర్జరీ లు చెపిస్తున్నాడు. ఇతను 2022 లో జనని, మరొక ఆసుపత్రి నడిపాడు రెండు ఆసుపత్రుల్లో నష్టం వచ్చింది. చైనాలో అవినాష్ డాక్టర్ చదవడం జరిగింది. 20 మందికి కిడ్నీ సర్జరీలు చేసినట్లు తెలిసింది. అవినాష్, రవి,మిశ్రా, గోపి,మరో నలుగురు మెడికల్ అసిస్టెన్స్ లను అరెస్ట్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు ముఠా సభ్యులు12 కోట్ల రూపాయలు వసూలు చేయటం జరిగింది. ఒక్కో సర్జరీ కి 50 నుండి 60 లక్షలకు వసూలు చేసి దాతకు 25 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నట్లు తేలిందిని అన్నారు..
- Advertisement -



