Breaking News
Friday, July 26, 2024
Breaking News

ఆంధ్ర రత్న భవన్లో బస చేసిన  వైఎస్ షర్మిల

- Advertisement -

ఆంధ్ర రత్న భవన్లో బస చేసిన  వైఎస్ షర్మిల
విజయవాడ
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్ ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కుమారుడి వివాహం అనంతరం బుధవారం సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్కు వచ్చిన వైఎస్ షర్మిల కేవీపీ ఇంటికి కాకుండా సడెన్గా రూట్ మార్చేశారు. తొలుత అంపాపురంలోని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసానికి వెళ్లాలని భావించారు షర్మిల. అయితే  పోలీసులు అనుసరిస్తున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు వెంటనే రూట్ మార్చి విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్కు టర్న్ తీసుకున్నారు. షర్మిల, కాంగ్రెస్ నేతలంతా ఆంధ్ర రత్న భవన్కు వెళ్లారు. గురువారం ఉదయం అక్కడి నుంచే ఛలో సెక్రటేరియట్కు వెళ్లాలని నిర్ణయించారు. ఆంధ్రరత్న భవన్కు చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ రాత్రి పార్టీ కార్యాలయంలోనే బస చేయనున్నారు. మరోవైపు ఈ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు. తొలుత షర్మిల కేవీపీ నివాసానికి వెళితే అక్కడ ఆమెను హౌజ్ అరెస్ట్ చేయాలని భావించారు. వెంటనే అలర్ట్ అయిన షర్మిల, కాంగ్రెస్ నేతలు.. ఆంధ్రరత్న భవన్కు చేరుకున్నారు. ముందస్తు అరెస్ట్ల నేపథ్యంలో ఇవాళ రాత్రి ఆంధ్రరత్న భవన్లోనే ఉండాలని నిర్ణయించారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ ‘ఛలో సెక్రటేరియట్’ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామని షర్మిల ప్రకటించారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!