- Advertisement -
ఏపీ రోడ్లకోసం 400కోట్లు మంజూరు
400 crore sanctioned for AP roads
ఎక్స్ లో కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ
అమరావతి
ఆంధ్రప్రదేశ్లో 200.06 కిలోమీటర్ల పొడవైన 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి కేంద్ర రహదారి మౌలిక వసతుల నిధి – సీఆర్ఎఎఫ్ నుంచి రూ.400 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. గుంటూరు- నల్లపాడు రైల్వే మార్గంలో రూ.98 కోట్లతో శంకర్ విలాస్ ఆర్వోబీని 4 వరుసలతో నిర్మించడానికి ఆమోదం తెలిపినట్లు అయన ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు గడ్కరీని కలిసి చర్చించిన నేపథ్యంలో మంజూరు అయ్యాయి.
- Advertisement -