- Advertisement -
మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ ఆహ్వానం
హైదరాబాద్: రజాకార్ సినిమా ట్రిజర్ కు భయపడే నిజాం వారసులు ఏదేదో వ్యాఖ్యలు చేస్తున్నారని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ట్విట్టర్ మెన్ కేటీఆర్ సెన్సార్ బోర్డ్ కి, పోలీసులకు లేఖ రాస్తామని బెదిరిస్తున్నారు. బీజేపీ నేతలు జోకర్లు కాదు.. హీరో. మీర్ ఉస్మాన్ అలీఖాన్ అరాచకాల గురించి మీ నాన్న మీకు చెప్పలేదా కేటిఆర్ ? మూవీ చూసిన తర్వాత సినిమాపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అన్నారు. రజాకార్ సినిమా కలిసి చూద్దామని కేటీఆర్ కు రాజాసింగ్ ఆహ్వానం పంపారు.
- Advertisement -


