- Advertisement -
న్యూఢిల్లీ: హమాస్ హింసతో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్ దేశం నుంచి భారతీలయను తీసుకువస్తున్న తొలి ఫ్లైట్ శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్పోర్టులో AI 1140 విమానం ల్యాండయింది. ఫస్ట్ బ్యాచ్లో 212 మంది భారతీయులు వచ్చారు. పలువురు తెలుగు విద్యార్థులు కుడా ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్టులో భారతీయులను కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రిసీవ్ చేసుకున్నారు. అయన కు విద్యార్దులు ఇజ్రాయెల్లో పరిస్థితులను వివరించారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ గురువారం రాత్రి బయలుదేరింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానం ల్యాండయింది. ఇజ్రాయెల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్రం ఆపరేషన్ అజయ్ చేపట్టిన విషయం తెలిసిందే.

- Advertisement -



