తెలంగాణ భాజపా మేనిఫెస్టోను విడుదల చేసిన అమిత్ షా

- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భాజపా మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం రాత్రి హైదరాబాద్ లో విడుదల చేశారు. ‘మన మోదీ గ్యారంటీ.. భాజపా భరోసా’ పేరుతో మేనిఫెస్టోను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే పథకాలు చక్కగా అమలవుతాయన్నారు. ఛత్తీస్ ఘఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినా ఎలాంటి వివాదాలు లేవని, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ సరిగా వ్యవహరించలేదని విమర్శించారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.2.15 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారన్నారు. తెలుగు రాష్ట్రాలకు 3 వందేభారత్ రైళ్లు కేటాయించామని గుర్తు చేశారు. కరోనా సమయంలో దేశమంతా ఉచితంగా రేషన్ ఇచ్చామన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీఆర్ కు చేరాయని అమిత్ షా ఆరోపించారు.

Telangana BJP Manifesto released by Amit Shah
Telangana BJP Manifesto released by Amit Shah

మేనిఫెస్టోలోని కీలక అంశాలివే..

• ధరణి స్థానంలో ‘మీ భూమి’ యాప్

• పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు.

• భారాస ప్రభుత్వం కుంభకోణాలపై విచారణకు కమిటీ ఏర్పాటు.

• గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక నోడల్ విభాగం ఏర్పాటు.

• ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1న వేతనాలు, పింఛన్లు.

• మత రిజర్వేషన్లు తొలగించి.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెంపు.

• ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా కమిటీ ఏర్పాటు.

Telangana BJP Manifesto released by Amit Shah
Telangana BJP Manifesto released by Amit Shah
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular