శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో వీరశైవ పంచాచార్య మహాపీఠాలలో ఒకటైన శ్రీమత్ గిరిరాజ సుర్యసింహాసనాధీశ్వర శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వార్లను సేవించారు.
ఆలయం వద్దకు చేరుకున్న పీఠాధిపతి వారికి ఆలయ గోపురం వద్ద అర్చకులచే సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద కార్యనిర్వహణాధికారి, అర్చకులు, వేదపండితలు ఆహ్వానం పలికారు. తరువాత పీఠాధిపతివారు శ్రీ స్వామివారికి సంప్రదాయబద్ధంగా శ్రీ స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు
అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో పీఠాధిపతివారికి దేవస్థానం తరుపున వస్త్ర సమర్పణ జరిపించబడింది. తరువాత పీఠాధిపతివారు ఆశీర్వచనాలు అందజేశారు.



