రైలుకు 50 ఏళ్లు పూర్తి.. ఘనంగా వేడుకలు, ఈ రైలు ఎందరికో ఓ ఎమోషన్
Godavari Express 50 Years గోదావరి ఎక్స్ప్రెస్ రైలుకు అరుదైన గౌరవం దక్కింది. ఆ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గోదావరి ఎక్స్ ప్రెస్ సేవలు విశాఖ – హైదరాబాద్ డెక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గోదావరి ఎక్స్ప్రెస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. విశాఖ స్టేషన్లోని ప్లాట్ఫార్మ్పై రైల్వే అధికారులు, ప్రజలు కేక్ కట్ చేశారు. గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లలో సంబరాలు చేసుకున్నారు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న గోదావరి ఎక్స్ప్రెస్ 1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టీమ్ ఇంజన్తో మొట్టమొదటిసారి పట్టాలు ఎక్కింది.రైళ్లలో నిత్యం లక్షలాదిమంది ప్రయాణిస్తుంటారు. కొన్ని రైళ్లలో ప్రయాణించేదుకు చాలామంది ఇష్టపడుతుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన రైలు ఏకంగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. విశాఖ-హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ రైలు సేవలు ప్రారంభమై 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా విశాఖ రైల్వేస్టేషన్లో సంబరాలు చేసుకున్నారు. రైలు వద్ద కేక్ కోసి ప్రయాణికులకు పంచారు.. ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ వైఎం రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. స్టేషన్ డైరెక్టర్ వి.వెంకటరాజు, స్టేషన్ మేనేజర్ అరుణశ్రీ, స్టేషన్ సూపరింటెండెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.ఈ ఐదు దశాబ్దాల కాలంలో ఈ ఎక్స్ప్రెస్ లక్షలాది మంది ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్య స్థానాలకు క్షేమంగా చేర్చింది. ఈ రైలు 1974 ఫిబ్రవరి 1న పట్టాలెక్కింది. 7007 నంబర్తో సికింద్రాబాద్–విశాఖ మధ్య నడిచేది. 2011 వరకూ ఈ రైలు ఎక్స్ప్రెస్గానే నడిచింది. అయితే దీనిని సూపర్ పాస్ట్ ఎక్స్ప్రెస్గా చేసి నంబర్ 12727గా మార్చారు. దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి ఎసీ ఫస్ట్క్లాస్ బోగీలతో నడిచే ఎక్స్ప్రెస్ ఇదే కావడం విశేషం.
అటు హైదరాబాద్, ఇటు విశాఖపట్నం వెళ్లేవారు ముందుగా ఈ రైలులో వెళ్లేందుకు ఇష్టపడతారు. .షెడ్యూల్ సమయాలకు అనుగుణంగా ఈరైలు నడవటమే కారణమని చెబుతుంటారు. ఈ రైలుకు 50 ఏళ్లు నిండటంతో చాలా మంది ప్రయాణికులు తమ అనుభూతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ రైలు 18 స్టేషన్లో ఆగుతుంది.. ప్రయాణ దూరం 710 కిలో మీటర్లు. సగటు ప్రయాణ సమయం 12 గంటల 25 నిమిషాలు కాగా.. 17 బోగీలతో ప్రయాణించే ఈ గోదావరి రైలు 50 Years celebration



