హోటళ్ళు బియ్యం చెక్ చేసుకోవాలి:పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటీ
రంగా రెడ్డి మార్చ్ 15
బాస్మతి నా మరొకటా ఆన్న విషయం లో స్పష్టత కోసం హొటల్ యాజమాన్యాలు బియ్యం నాణ్యత పట్ల అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా బియ్యం ను పరిశీలించి మరీ కొనుగోలు చేయాలని వినియోగ దారుల వ్యవహారాలు,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ డి టి మాచన రఘునందన్ స్పష్టం చేశారు.శుక్రవారం నాడు రఘునందన్ వినియోగ దారుల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ..హోటల్ వారికి ఈ మేరకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..ఇటీవల మైలార్ దేవ్ పల్లి లో జరిపిన తనిఖీ ల్లో ఓ బియ్యం గిడ్డంగి పై అనుమానాలు కలిగాయన్నారు.ఈ మేరకు అటు వినియోగదారులు ఇటు హోటల్ వ్యాపారం చేసే వాళ్ళు బాస్మతి బియ్యం దిగుమతి పై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.బియ్యం ను దిగుమతి చేసుకుంటున్న పలు బడా హోటళ్లు,తమకు సరఫరా అవుతున్న బియ్యం లో నాణ్యత ఎంత ఆన్న విషయం పై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయ పడ్డారు.ఆయా బిజినెస్ హోటళ్ళ లో స్టోర్ మేనేజర్ లు బియ్యం నాణ్యత పై పెద్దగా దృష్టి సారించే అవకాశం ఉన్నా..లేక పోయినా..హొటల్ యాజమాన్యాలు, నిర్వాహకులు ఒకింత శ్రద్ద పెడితే ..వినియోగదారుల్లో. చైతన్యం పెరిగింది అని భావించి, బియ్యం అక్రమాలకు ఆస్కారం కలగదన్నారు.
హోటళ్ళు బియ్యం చెక్ చేసుకోవాలి:
- Advertisement -
- Advertisement -