గజ్వేల్ రైతులకు కోమటిరెడ్డి కీలక హామీ..

- Advertisement -

RRR‌లో భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని వారి నివాసంలో కలిశారు. మా భూములు RRR‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వాపోయారు. తాను సీఎంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు ధైర్యం చెప్పారు కోమటిరెడ్డి. గత ప్రభుత్వంలా ఒంటెద్దు పోకడలు పోకుండా.. ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular