22-ఏ భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు లేకుండా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

22-ఏ భూముల రిజిస్ట్రేషన్లకు అడ్డంకులు లేకుండా చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

Measures to ensure registration of ’22-A’ lands proceeds without hurdles: CM Revanth Reddy

ప్రైవేట్ భూములకు ఒక్క అంగుళం కూడా ఇబ్బంది రానివ్వం.. 22-ఏ జాబితాపై రెండు రోజుల్లో పరిశీలన

హైదరాబాద్, ఆగస్టు 18: 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో స్లాట్‌ తీసుకున్న ఆస్తి 22-ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్లయితే, రెవెన్యూ అధికారులు రెండు రోజుల్లోగా పరిశీలన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పరిశీలనలో అది ప్రైవేట్ భూమిగా తేలితే వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు.

తప్పులు లేకుండా తుది జాబితా

22-ఏ జాబితాలో ఉన్న భూములను జిల్లా కలెక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారం కోసం సరైన జాబితాను రూపొందించాలని సీఎం ఆదేశించారు. జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం తెలిపారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వబోమని స్పష్టం చేశారు.

దళారులను ఆశ్రయించొద్దు

22-ఏ భూముల వ్యవహారంలో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ఈ అంశంపై వస్తున్న పుకార్లు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరారు.

“ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటాం” అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular