- Advertisement -
జార్ఖండ్లోని పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్బాల్ ప్లేయర్లు మృతి, 11 మందికి గాయాలు
2 football players killed, 11 injured in lightning strike in Jharkhand
Aug 30, 2024
జార్ఖండ్లోని పిడుగుపాటుకు ఇద్దరు ఫుట్బాల్ ప్లేయర్లు మృతి, 11 మందికి గాయాలు
జార్ఖండ్లోని లతేహర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఇట్కే గ్రామంలో ఫుట్ బాల్ పోటీల ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ ముగిసే సమయానికి అకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువ ఫుట్ బాల్ ప్లేయర్లు దీపక్, వీరేంద్ర మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను బాలుమత్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి.
- Advertisement -



