- Advertisement -
అనుమానంతో హత్య
Murder on suspicion
మెదక్, సెప్టెంబర్ 16, (వాయిస్ టుడే)
మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారి పోతున్నాయి..వివాహేతర సంబంధాలు పెనుభూతంగా మారి ప్రాణాలు తీస్తున్నాయి. ఒకవైపు భర్తను భార్య మోసం చేస్తుంటే, మరోవైపు భార్యను భర్త మోసం చేస్తున్నాడు. కొంత మంది కేవలం అనుమానం పెంచుకుని భాగస్వామి ప్రాణాలు తీసేస్తున్నారు. దీంతో వారి పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి సంగారెడ్డి జిల్లా అందోల్లో చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న వ్యక్తి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే అందోల్కు చెందిన నర్సింహులు, ఇందిర దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు..భార్యకు వివాహేతర సంబంధం ఉందని నమ్మిన నర్సింహులు తరచూ ఆమెతో గొడవకు దిగేవాడు. ఇదే విషయమై వారి మధ్య ఆదివారం సంవాదం జరిగింది. దీంతో ఇద్దరూ ఘర్షణకు దిగారు. తీవ్ర కోపోద్రిక్తుడైన భర్త ఆమెను గొంతు నులిమి చంపేశాడు..అనంతరం ఏమీ తెలియనట్లు మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామం అందోల్కు తీసుకెళ్లాడు. ఇందిరది సాధారణ మరణంగానే కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించే ప్రయత్నం చేశాడు నర్సింహులు.అయితే మృతురాలి బంధువులు, స్థానికులంతా నిందితుడ్ని గట్టిగా నిలదీయడంతో భార్య ఇందిరను గొంతు నులిమి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన జోగిపేట పోలీసులు.. నిందితుడు నర్సింహులను అదుపులోకి తీసుకున్నారు..పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
- Advertisement -