- Advertisement -
పారిజాత గిరి ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం
Road accident on Parijata Giri Ghat roadముగ్గురికి తీవ్ర గాయాలు
ఏలూరు
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాత గిరి ఆలయం ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. కొండ పై నుంచి స్కూటీ పై కిందకు దిగుతుండగా బ్రేక్ వైర్ తెగిపోయింది. దాంతో వాహనం కొండపైనుంచి పల్టీలు కొట్టింది. ప్రమాదం లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు బుట్టాయగూడెం మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన భక్తులు గా గుర్తించారు.
- Advertisement -




