- Advertisement -
నరసాపురంలో హిందూవుల నిరసన
Hindu protest in Narasapuramనరసాపురం
తిరుమల తిరుపతి లడ్డు కల్తీ భాద్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ పశ్చిమ గోదావరి నరసాపురంలో హిందువులు అధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసారు.ముందుగా పట్టణం లోని పాతబజారులో వేంచేసియున్న శ్రీ వరాహ వేంకటేశ్వరస్వామి ఆల యంలో స్వామివారికి పూజలు చేసి అనంతరం భారీ ర్యాలీ పట్టణం లో వూరేగుతూ స్ధానక అంబేద్కర్ సెంటర్లో మానవహరం గా ఏర్పడి తమ నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ వారి కార్యాలయం వద్ద తమ నిరసనలు తెలుపుతూ తిరుమల తిరుపతి మహాప్రసాదం కల్తీ చేసిన వారికి వెంటనే శిక్షించాలని అంటూ నినాదాలు చేసారు.అనంతరం సబ్ కలెక్టర్ అచ్యుత్ అంబరీష్ కు మెమోరాండం ఇచ్చారు.ఈ కార్యాలయం లో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు. నరసాపురం నియోజకవర్గం టి.డి.పి. ఇన్చార్జి పొత్తూరి రామరాజు. తెలుగుదేశం నాయకుడు కొవ్వలి యతిరాజా రామ్మాహన్ నాయడు మరియు పట్టణం లోని ఆచార్యులు పట్టణ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




