- Advertisement -
శభాష్ సురేష్
Sabhash Sureshనందిగామలో ఆటో డ్రైవర్ నిజాయితీ
నందిగామ
నందిగామ పట్టణంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న సురేశ్ కుమార్ బుధవారం రాత్రి ఆటోలో లక్ష్మీ తులసమ్మ అనే మహిళ ప్రయాణం చేసింది. ఈ క్రమంలో ఆటోలో బంగారు ఆభరణాలు మర్చిపోవడంతో ఆటో డ్రైవర్ నందిగామ పోలీస్ స్టేషన్లో సీఐ వైవిఆర్ నాయుడుకి అందజేసారు. అనంతరం లక్ష్మీ తులసమ్మను స్టేషన్కు పిలిపించి ఆమె బంగారు ఆభరణాలు ఆమెకి ఇప్పించారు. నిజాయితీ చూపించిన ఆటో డ్రైవర్ను ఆయన సన్మానించారు
- Advertisement -




