- Advertisement -
విశాఖలో ఘనంగా రాష్ట్ర అవతరణోత్సవం
Grand inauguration of the state in Visakhapatnamవిశాఖపట్నం
ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని విశాఖలో తెలుగుదండు ఘనంగా నిర్వహించింది.మద్దిలపాలేం కూడలి వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహానికి పూల మాల వేసిన అనంతరం తెలుగుదండు వ్యవస్థాపకుడు పరవస్తు ఫణి శయన సూరి మాట్లాడుతూ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేని స్ధితిలో ప్రభుత్వాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఏపీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడంపై దృష్టి పెట్టాలని కోరారు.ప్రాధమిక విద్య తెలుగు భాషలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు.
- Advertisement -




