మంత్రి లోకేష్ కు రుణపడి ఉంటాం..
We are indebted to Minister Lokesh..
శ్రీ అవధూత కాశి నాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో ఫారెస్ట్ అధికారులు ఇటీవల పలు భవనాలను కూల్చివేసిన విషయం తెలిసిందే.. ఈ విషయంపై నారా లోకేష్ స్పందించి ఆయన తరపున ఖాదీ& గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరిని జ్యోతి క్షేత్రానికి పంపించి పునర్నిర్మాణ పనులు పూర్తి అయ్యేవరకు అక్కడే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.. అప్పటినుండి పనులు పూర్తయ్యే వరకు ఆయన పర్వేక్షిస్తున్నారు.. దీంతో స్థానిక టిడిపి నాయకులు పునర్నిర్మాణ పనులు పూర్తయిన భవనం వద్ద థాంక్యూ లోకేష్ సార్ అనే పోస్టర్లను విడుదల చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లక్షలాదిమంది జ్యోతి క్షేత్ర భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా స్పందించిన వెంటనే కూల్చివేతలను పునర్నిర్మించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నారా లోకేష్ నిలిచిపోయారన్నారు.. కూటమి ప్రభుత్వం మాట చెప్పిందంటే పూర్తి చేసే వరకు నిద్రపోమన్నారు.. మంత్రి నారా లోకేష్ కు కాశిరెడ్డి నాయన భక్తులు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ కార్యక్రమంలోఖాదీ& గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కేకే చౌదరి,టిడిపి నాయకులు రాజా రెడ్డి, రవీంద్రారెడ్డి, గురివిరెడ్డి, బిజీ వేముల రాజశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి,రమణారెడ్డి, కృష్ణారెడ్డి, పోలిరెడ్డి, కల్వకురి రమణ, రోహిత్ రెడ్డి,గురువయ్య, విజయ్ కుమార్ రెడ్డి,సుధాకర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు..



