Sunday, February 22, 2026

ప్రధాని–సీఎం భేటీలో బీసీ రిజర్వేషన్లు ఎందుకు లేవు?

- Advertisement -

ప్రధాని–సీఎం భేటీలో బీసీ రిజర్వేషన్లు ఎందుకు లేవు?

జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ ఆగ్రహం

Why are there no BC reservations in the Prime Minister-CM meeting?

** హైదరాబాద్, బుధవారం: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలతో సమావేశమైన సందర్భంలో బీసీ రిజర్వేషన్ల కీలక అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టడం తీవ్ర అనుమానాస్పదమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కోఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ మండిపడ్డారు.

వివేక్ పటేల్ మాట్లాడుతూ— “తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్రంలో నెలల తరబడి పెండింగ్. ఇలాంటి నేపథ్యంలో ప్రధాని–సీఎం భేటీ ఒక అపూర్వ అవకాశం. అటువంటి సమయంలో సీఎం ఆ అంశం ప్రస్తావనకూడా చేయకపోవడం బీసీలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి తార్కాణం” అని ప్రశ్నించారు. కేంద్రంలో మూడు బిల్లులు పెండింగ్… కానీ సీఎం నోరు ఎందుకు తెరవలేదు?

వివేక్ పటేల్ పేర్కొంటూ— Telangana Assembly ఆమోదించిన 42% BC రిజర్వేషన్ల చట్టం BC ఉద్యోగ రిజర్వేషన్ బిల్లు స్థానిక సంస్థల రిజర్వేషన్ సవరణ బిల్లు మూసి ఉన్న డ్రాయర్‌లుగా కేంద్ర మంత్రుల కార్యాలయాల్లోనే పడివున్నాయని తెలిపారు. “పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఈ సమయమే ఒత్తిడి తీసుకురావాల్సిన బంగారు అవకాశం. అయినా సీఎం ఈ అంశంపై ఒక మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యకరం కాదు… దురుద్దేశపూర్వకమే” అని విమర్శించారు.

వినతిపత్రంలో బీసీల ప్రస్తావనే లేకపోవడం – బీసీ సమాజానికి అవమానం ప్రధాని మోదీకి సమర్పించిన వినతిపత్రంలో బీసీ రిజర్వేషన్ల చట్టం ఆమోదించాలని ఒక్క మాట కూడా లేకపోవడాన్ని ‘దుర్మార్గం’ అని వివేక్ పటేల్ ఖండించారు. అంతేకాదు, “రాహుల్ గాంధీతో భేటీలో కూడా బీసీల హక్కుల కోసం పోరాడాలని, అవసరమైతే పార్లమెంటును స్తంభింపజేయాలని అడగకపోవడం కాంగ్రెస్ కపట స్వభావాన్ని బయటపెడుతోంది” అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ కపట నాటకాన్ని బీసీలు గమనిస్తున్నారు

“బీసీలు ఈ రాష్ట్రంలో 54% జనాభా. వారి కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ప్రచారం చేయడం, అసలు కేంద్ర ఆమోద దశలో నోరు మూసుకోవడం— ఇది కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ మాయాజాలం” అని ఆయన తీవ్రస్థాయిలో స్పందించారు. “బీసీ హక్కులపై ప్రభుత్వం విఫలం అవుతూ కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. కాంగ్రెస్ చేస్తున్న కపటాన్ని రోజుకో రోజు బయటపెడతాం” అని హెచ్చరించారు. “బీసీ రిజర్వేషన్ల బిల్లులు కేంద్రంలో ఏ దశలో ఉన్నాయో, ఎప్పుడూ చర్చించారో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలి. లేకపోతే బీసీలతో చేసేది మోసమని తేలుస్తాం” అని ఆయన దుయ్యబట్టారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్