అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం
సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పణ
భక్తుల తాకిడితో కిక్కిరిసిన భద్రాద్రి క్షేత్రం
రూ. 351 కోట్లతో ఆలయ విస్తరణ తొలిదశ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం
శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహణ
Grand Celebration of the Divine Wedding of Sri Sita and Rama
CM Ennumula Revanth Reddy Participates with His Spouse, Offering Silk Garments and Sacred Rice

CM Ennumula Revanth Reddy Participates with His Spouse, Offering Silk Garments and Sacred Rice
భద్రాచలం, మార్చి 27
భద్రాచలంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.
భద్రాచలం మిథిలా స్టేడియంలో నిర్వహించిన శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం వేలాది భక్తుల మధ్య అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి దంపతులు స్వామి, అమ్మ వార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
మిథిలా స్టేడియంలో శ్రీ రామచంద్రస్వామి, సీతమ్మ వారికి పూజా కార్యక్రమం, అలంకరణ, తదితర కార్యక్రమాలు నిర్వహించి పెళ్లి కొనసాగించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఆలయ అర్చకులు సంప్రదాయబద్ధంగా అన్ని కార్యక్రమాలను నిర్వహించారు.
భద్రాచలం ఆలయం సర్వాంగ సుందరంగా అలంకరించబడగా, భక్తుల రాక పోకలతో క్షేత్రం కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దర్శనం కోసం భారీగా తరలివచ్చి దర్శనం పొందారు.
భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. త్రాగునీరు, అన్న ప్రసాదం, వైద్య శిబిరాలు, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకున్నారు.
అంతకుముందు ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్వామి వారిని దర్శించు కున్నారు. అనంతరం ఆలయం వద్ద 351 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి తొలిదశ పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జి మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, న్యాయమూర్తులు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా అయ్యర్, ఎండోమెంట్ కమీషనర్ హన్మంత రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్, పీఓ బి. రాహుల్, అదనపు కలెక్టర్లు విద్యా చందన, వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, మీడియా ప్రతినిధులు, లక్షలాది మంది భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.



