రాజకీయ వ్యూహంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్దం
మంత్రి పొన్నం
హైదరాబాద్
Ready to Resolve RTC Workers’ Issues
— Minister Ponnam
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ ప్రజా శ్రేయస్సు దృశ్య ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేస్తున్నని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆర్టీసీ లో రోజుకు 65 లక్షల మంది ప్రయాణికులు అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.వారు ఉద్యోగ రీత్యా,విద్యా,వైద్య అవసరాలకు ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. మిగిలిన మూడు అంశాలపై చర్చిస్తున్నాం.. మేము రాగానే వేసిన మొట్ట మొదటి కమిటీ సీనియర్ ఐఏఏస్ లతో వేశాం. అధికారుల కమిటీ తో ఐదు గంటలపైగా చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని మద్యలో వెళ్లిపోవడం ఇది కుట్ర లో భాగమేనని అన్నారు.
ఇటీవల జగిత్యాల సభలో మహా లక్ష్మీ ప్రయాణం కేసీఆర్ అవహేళన గా మాట్లాడారు. వెంటనే ఆర్టీసీ పై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ గౌరవ అధ్యక్షుడు గా ఉన్న హరీష్ రావు సమ్మె పై కార్మికులను ప్రోత్సహించారు. మహా లక్ష్మీ పథకాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు ఆర్టీసీ డిమాండ్స్ పై చర్చిస్తున్నాని అధికారులు చెప్పారు. అయిన వినకూడనే ఎవరితో ఫోన్ లో మాట్లాడి సమ్మె కి వెళ్ళారు. ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం..1134 మందికి కారుణ్య నియామకాలు ఇచ్చాం. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పని భారం లేకుండా కార్మిక చట్టాలు లోపలే చేశాం. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మరునాడు హాఫ్ ఉండేది..వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేమే పని భారం లేకుండా చేయాలని చూస్తున్నాం. మేము శ్రమ దోపిడి చేయదలచుకోలేదు. విలీనం,యూనియన్ ల అంశాలపై ప్రభుత్వం పరిగణన లో ఉంది. ప్రభుత్వం నెలకి ఆర్టీసీకి 300 కోట్ల,అవసరమైనప్పుడు 400 కోట్లు ఎంత అవసరం ఉంటే అంత ఇస్తుంది. ఆర్టీసీ లో సర్వీసు నుండి రిమూవ్ అయిన వారికి 250 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నాం. పేద ప్రజల లైఫ్ లైన్ ఆర్టీసీ..ఆర్టీసీ నిర్వీర్యం చేసే కుట్రలు చేయద్దు. పేద ప్రజల రవాణా వ్యవస్థ బాగుండాలి,పని చేస్తున్న 40 వేల కుటుంబాల ఉద్యోగుల బాగుండాలి నిరసనలు చెప్పే వారు బస్ డిపో లు చేసుకోండి.. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. మేము ఏర్పడిన తరువాత మొదటి కమిటీ వేశాం మేము కమిటీ కి 4 వారాల సమయం అడిగాం. ప్రభుత్వం తో కూర్చొని మాట్లాడాల్సిన అంశాలు. నాయకత్వం వహించిన వారు రిటైర్డ్ అయిన వారు,ఉద్యోగాలు చేయని వారు ఉన్నారని అన్నారు.
గత ప్రభుత్వం ఆర్టీసీ నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరించింది..ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఎండీ కి ప్రిన్సిపల్ సెక్రటరీ కి తెలియకుండా ఆదరభదార గా విలీనం అంశాన్ని తెచ్చారు. ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరకు రండి కూర్చొని మాట్లాడడం. మహా లక్ష్మీ పథకం నచ్చినంత మాత్రాన మీరు ఆర్టీసీ పై కుట్రలు చేస్తున్నారు. రాజకీయ వ్యూహంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పేద ప్రజల ప్రయాణానికి సంబంధించి ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్న వారు సంస్థ పరిరక్షణ దృశ్య,ప్రయోజన దృశ్య సమ్మె విరమించాలి. అధికారులు ఆర్టీసీ కార్మికులు సమ్మె కి పోతున్నారని ఊహించలేదు. డిప్యూటీ సీఎం చెన్నై లో ఉండడం వల్ల మాట్లాడలేకపోయం. డిపో వారిగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్న దగ్గర తగ్గించేందుకు సిద్ధం. మేము కింది స్థాయి నుండి వచ్చాం..ఆర్టీసీ కుటుంబాల తో 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక సార్లు ఇంటరాక్ట్ అయ్యారు. ఉద్యోగస్థులు అక్కా చెల్లెలు,అన్న దమ్ములు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలి. 29 అంశాలపై వెంటనే మేము టేబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం..ఇప్పటికిప్పుడు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం ఆర్థిక పరమైన అంశాలను కూడా ప్రభుత్వం భారం మోయడానికి సిద్ధంగా ఉందని అన్నారు.
విలీనం,సంఘాల ఏర్పాటు, పీఆర్సీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుంది మూడు సాంకేతిక అంశాలపై కమిటి రిపోర్ట్ అందిస్తుంది. అధికారుల సంప్రదింపులు కొనసాగుతుండగానే కమిటీ లోని వికాస్ రాజ్, దాన కిషోర్, సందీప్ కుమార్ సుల్తానియ మీ అంశాలపై సానుకూల దృక్పథంతో ఉండేవారు.ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాం పెండింగ్ బకాయిలు చెల్లిస్తున్నాం.సమ్మె దృశ్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాంగత ప్రభుత్వం యూనియన్ లను రద్దు చేసినప్పుడు ఎందుకు అడగలేదు. ఈవీ బస్సులు 2018 లో స్టార్ట్ అయ్యాయి అది కేంద్ర ప్రభుత్వ స్కీమ్..ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఈవీ బస్సుల కారణంగా ఒక్క ఆర్టిసి ఉద్యోగి నీ కూడా తొలగించం. దేశ వ్యాప్తంగా 14 వేల బస్సులు ఇస్తుండగా తెలంగాణ కి 2 వేల బస్సులు ఇస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి ఈవీ బస్సులు తీసుకొస్తున్నారు. ఆర్టీసీ అనేక సంస్కరణలు తీసుకొస్తుంది. బేషరతుగా సమ్మె విరమించండి మీ సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధం ఉన్నాం. ప్రతిపక్ష పార్టీకి కావాల్సింది దోపిడీ. మేము వచ్చిన తర్వాత 2800 బస్సులు కొనుగోలు చేశాం. 2017 పీఆర్సీ ఇచ్చాం.. 2013 బాండ్స్ 280 కోట్లు ఇచ్చాం. సర్వీసు నుండి శాశ్వతంగా రిమూవ్ అయిన వారికి 250 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మూడు సంవత్సరాల పిరియడ్ ను 2 సంవత్సరాలకు తగ్గించాం. ఆర్టీసీ డిపో లు ఎవరి సొత్తు కాదు. హైదరాబాద్ లో ఇబ్బందులు కలగకుండా ఎంఎంటీఎస్, మెట్రో సర్వీసులు ఫ్రీక్వెన్సీ పెంచాలని చెప్పాం ఆర్టీసీ ఉద్యోగులను రవాణా శాఖ మంత్రి గా కోరుతున్న. మీ నిరసన ప్రజాస్వామికంగా ప్రభుత్వం గురించే విధంగా ఉండాలి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ,హరీష్ రావు ఆర్టీసీ సమ్మె తో రాక్షసానందం పొందడం,మహిళా ప్రయాణికులను ఇబ్బంది కలగజేయవద్దు. తెలంగాణ అక్కా చెల్లలు దాదాపు 300 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసి 10 వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని అన్నారు.



