- Advertisement -
ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన లారీ
A lorry hit a two-wheelerగన్నవరం
గన్నవరం స్థానిక వెంకటేశ్వర సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇరువురిని లారీ ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు ఉంగుటూరు మండలం గారపాడు గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. క్షద గాత్రులను చికిత్స నిమిత్తం ఆటోలో పినమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో గాయపడిన ఇరువురిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. గన్నవరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
- Advertisement -




