అమిత్ షా వెంటనే  క్షమాపణ చెప్పి యంపీ పదివికి రాజీనామా చేయాలి

- Advertisement -

అమిత్ షా వెంటనే  క్షమాపణ చెప్పి యంపీ పదివికి రాజీనామా చేయాలి

Amit Shah should immediately apologize and resign from YMP Tenavi

-భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్

వేములవాడ
నిన్నటి రోజు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో  అంబేద్కర్ ను ఆగౌరవపరుస్తూ మాట్లాడటాన్ని ఖండిస్తూ వెంటనే క్షమాపణ చెప్పి యంపీ పదవికి రాజీనామా చేయాలి,భీమ్ ఆర్మీ జిల్లా అద్యక్షులు దొబ్బలప్రవీణ్

కుమార్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ తరతరాలుగా  అవమానాలకు అణిచివేతకు ఆంటరానితానికిగురి అయి ఒకవ్గరం చేతుల్లో బానిసలుగా మిగిపోయిన ఈ దేశంలో నూటికి తొంభై శాతం ఉన్న

ప్రజలకు  బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా వారి చీకటి  బ్రతుకులు నుండి వెలుగు వైపు నడిపించి వారికి సమాన హక్కులు కల్పించిన  బాబా సాహెబ్ అంబేద్కర్ ను పేరు బదులు దేవుని పేరు తలిస్తే

ఏడు జన్మల పుణ్యం వస్తుంది అనడం బిజెపి నేతలకు బిజెపి,పార్టీకి అంబేద్కర్ పైన ఎంతటి ద్వేషం ఉన్నదో అర్దం అవుతుంది అని అన్నారు.మనిషి మనిషిగా చూడని ధర్మాలు దేవుళ్ళు ఒకవైపు ఉంటే మనిషి మనిషిగా

గౌరవించే,భారత రాజ్యాంగం ద్వారా ప్రతి బడుగు బలహీన వర్గాల అట్టడుగు వర్గాలకు సమానమైనటువంటి హక్కులు కల్పించి సమానత్వం సమాజాన్ని నిర్మించిన,డాక్టర్ బాబాసాహెబ్ ఈ దేశ ప్రజలకు ఆరాధ్య దైవం అని

అతడే ఈ దేశానికి దేవుడు అని ను నూటికి 90 శాతం ఉన్న ప్రజలుకొలుస్తున్నారని అటువంటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడం ఎస్సీ,ఎస్టీ,బీసీల పైన బిజెపి,ఆర్ఎస్ఎస్ ఉన్న ద్వేషం స్పష్టంగా అర్థమవుతుందని

అన్నారు.ఒక వైపు నరేంద్ర మోడీ చాయ్ అమ్ముకునే నేను ఈ దేశ ప్రధాని అయినట్టే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ అని  పార్లమెంటు సాక్షిగా స్పష్టంగా నమస్కారం చేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు క్యాబినెట్

మినిస్టర్ అయిన అమిత్ షా అంబేద్కర్ గురించి మాట్లాడితే అతని వెనుకేసుకురావడం అంటే మోడీ యొక్క అంబేద్కర్ పై ఉన్న కపట,నాటకం అర్థమవుతుందని అన్నారు.నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ప్రేమ

ఉంటే వెంటనే అమిత్ షా ను క్యాబినెట్ నుండి తొలగించి ఎంపీకి రాజీనామా  చేయించాల్సిందిగా అలాగే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పించాల్సిందిగా అన్నారు,లేదంటే రేపటి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు

ఉదృతం చేస్తూ బిజెపి కార్యాలయాలను,బిజెపి ఎమ్మెల్యేలు,ఎంపీలను మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మధు,నాగరాజు,సాయి,ప్రశాంత్, వంశి,వినోదు తదితరులు

పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular