- Advertisement -
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎపి మంత్రి భేటీ
AP Minister met Union Minister Nitin Gadkariన్యూఢిల్లీ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలను కేంద్రం దృష్టి కి తీసుకెళ్లి పరిష్కారానికి సహకారం కోరారు. సుమారు 45 నిమిషాలు రవాణా అంశాలపై కేంద్ర మంత్రితో రాంప్రసాద్ రెడ్డి సుదీర్ఘ చర్చ జరిపారు. కడప నుండి రాయచోటి వరకు 4 లేన్ల రహదారిని మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాజంపేట – రాయచోటి – కదిరి రహదారి – రాష్ట్ర రహదారి నుండి జాతీయ రహదారి జాతీయ రహదారిగా మెరుగుపరచండి. రాయచోటిలో రోడ్ల విస్తరణ గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా హెడ్ క్వార్టర్స్ మధ్య మెరుగైన కనెక్టివిటీని సులభతరం చేసేందుకు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధుల ద్వారా పనులకు అనుమతులు కోరారు.
- Advertisement -




