Sunday, September 8, 2024

అట్లాంటాలో ఆప్త (APTA) వేడుకలు

- Advertisement -
apta-apta-celebrations-in-atlanta
apta-apta-celebrations-in-atlanta

ఆప్త 15 సంవత్సరాల వేడుకలు గ్యాస్ సౌత్ కన్వెన్షన్ సెంటర్, అట్లాంటా  మహా నగరం లో ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ వేడుకలకి దేశ విదేశాల నుంచి తెలుగు వారు, రాజకీయ నాయకులు, సినిమా తారలు,  పారిశ్రామికవేత్తలు పాలు పంచుకున్నారు.   అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం 6 గంటలకి కర్టెన్ రైజర్ తో వేడుకలు ఆరంభమయ్యాయి. కార్యక్రమాలలో మొదటి భాగంగా ప్రధాన దాతలు  సుబ్బు కోట గారు, విజయ్ గుడిసెవా , ఉదయభాస్కర్ కొట్టే, శ్రీని బయిరెడ్డి, రావు రెమ్మల, రాజేష్ కళ్లేపల్లి,  సూర్య & సత్య తోట తదితురులని సత్కరించడం జరిగింది.   ఈ కార్యక్రమంలో సమంత ప్రభు  మరియు సాయి ధర్మతేజ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. చివరిగా రఘు కుంచె తన సంగీత విభావరితో ప్రేక్షకులని ఉర్రూతలూగించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు, బొత్స సత్యనారాయణ, బండి సంజయ్ హరి ప్రసాద్ పసుపులేటి, రామ్ బంద్రెడ్డి, కళ్యాణ్ దిలీప్ సుంకర మరియు సంగీత విద్వాంసులు – కోటి,  రఘు కుంచె, లిరిసిస్ట్- అనంత్ శ్రీరామ్.  మొత్తంగా ఆప్త 15 సంవత్సరాల సంబరాలు విందు వినోదాలతో, ఆట పాటలతో కన్నులఁపండుగగా మొదలయ్యింది.

apta-apta-celebrations-in-atlanta
apta-apta-celebrations-in-atlanta
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్