ఏసీబీ వలలో చిక్కిన ఏఎస్ఐ
15వేల రూపాయలు డిమాండ్
ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
మల్కాజ్గిరి కమిషనరేట్
చైతన్యపురి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్సై బాలయ్య అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు.
కాంప్రమైజ్ అయిన మహిళా వేధింపుల కేసును రంగారెడ్డి జిల్లా కోర్టులో లోక్ అదాలత్ ద్వారా క్లోజ్ చేయించడానికి రూ.15 వేల లంచం డిమాండ్ చేశారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం. 363/2025లో పల్లపు రాంబాబు పై మహిళా వేధింపుల కేసు నమోదు చేశారు..!
ఈ కేసు కాంప్రమైజ్ అయిన అనంతరం దాన్ని లోక్ అదాలత్ ద్వారా క్లోజ్ చేయించడానికి ఏఎస్సై బాలయ్య లంచం డిమాండ్ చేశారు.
బాధితుడు పల్లపు రాంబాబు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. అధికారులు ముందస్తుగా ట్రాప్ ఏర్పాటు చేసి కోర్టు ప్రాంగణంలోనే బాలయ్య లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.



