సింహాచలంలో అప్పన్న సేవలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు
BJP National President Nitin Nabin offers prayers to Lord Appanna at Simhachalam.
సింహాచలం, ఆగస్టు 18 (వాయిస్ టుడే): భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న నితిన్ నబిన్కు అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కప్పస్తంభం ఆలింగనం చేసుకుని స్వామివారి ఆశీర్వచనాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో నితిన్ నబిన్ను శాలువాతో సత్కరించి, స్వామివారి జ్ఞాపికను అందజేశారు.
అంతకుముందు భోగాపురం విమానాశ్రయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేలు లోకం మాధవి, సుందరపు విజయ్కుమార్ స్వాగతం పలికారు.




