Sunday, September 8, 2024

కేసులు… ఫిరాయింపులు

- Advertisement -

కేసులు… ఫిరాయింపులు

Cases… Deviations

విజయవాడ, జూలై 12
ఏపీలో అధికారం చేతులు మారాక… కొందరు వైసీపీ నేతల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఐదేళ్లు అధికారంలో ఉండగా, చక్రం తిప్పిన నేతలు… నోటికి పని చెప్పిన నాయకులు…. ఇప్పుడు గుట్టుగా కాలం వెళ్లదీస్తున్నారు. తమ ఆచూకీ కూడా తెలియకుండా పూర్తిగా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. అలాంటి వారిలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కొడాలి నాని. పౌరసరఫరాల శాఖ మాజీ మంత్రి కొడాలి నాని గత ఐదేళ్లలో ఎలాంటి సౌండ్‌ చేసే వారో అందరికీ తెలిసే ఉంటుంది. ఏది మంచో… ఏదో చెడో కూడా ఆలోచించకుండా ప్రత్యర్థులపై మాటలతో విరుచుకుపడి టీడీపీకి టార్గెట్‌ అయ్యారు కొడాలి నాని.అసెంబ్లీ, కేబినెట్‌ భేటీ, పబ్లిక్‌ మీటింగ్‌ ఇలా ఏదైనా సరే… వెనకా ముందు ఆలోచించకుండా… సీఎం చంద్రబాబుపై ఏకవచనంతో విరుచుకుపడిన కొడాలి నాని… ఇప్పుడు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్‌ ఉమ్మడిగా టార్గెట్‌ చేయడంతో కొడాలి పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యిలా తయారైంది. దాదాపు 20 ఏళ్లుగా గుడివాడలో నిర్మించుకున్న సామ్రాజ్యం… ఒక్క గాలివానకు కూలిపోయినట్లు… గత ఎన్నికల్లో కూటమి సునామీతో కొడాలి కోట గల్లంతైంది. దీంతో కష్టాలన్నీ కూడబలుక్కుని కొడాలిని చుట్టుముడుతున్నాయి.తొలుత వలంటీర్లు, ఆ తర్వాత బెవరేజస్‌ గొడౌన్‌ గొడవలో ఓ లీజుదారు మాజీ మంత్రి కొడాలిపై కేసులు పెట్టారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్న కొడాలిని.. ఇంకోవైపు నుంచి బియ్యం స్కాం కమ్మేస్తోందంటున్నారు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో బియ్యం స్కాంపై తనిఖీలు చేస్తున్న అధికారులు ఉచ్చు బిగిస్తుంటే… ఆ ఉచ్చులో కొడాలి కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పొలిటికల్‌ సర్కిల్స్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఇలా కేసులతో కుమ్మేయాలని ప్రభుత్వం చూస్తుంటే… స్థానిక ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తుండటం… మాజీ మంత్రికి షాకిస్తోందంటున్నారు.ఇరవయ్యేళ్లుగా గుడివాడను అడ్డాగా చేసుకున్న కొడాలి… ఈ ఎన్నికల్లో దాదాపు 50 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక వైసీపీ ప్రభుత్వం కూడా ఓడిపోవడంతో ఒంటరి అయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే… ప్రతీకారంతో రగిలిపోయిన టీడీపీ కేడర్‌… మాజీ మంత్రి ఇంటిపై దాడికి వెళ్లినా ఎలాంటి చప్పుడు చేయలేదు కొడాలి నాని. అంతేకాదు తన సహజ సిద్ధశైలికి భిన్నంగా నడవడం మొదలుపెట్టారు. ఎన్నికల ఫలితాలు విడుదలై నెలరోజులు అవుతున్నా… ఒకటి రెండు సార్లు మాత్రమే బయటకి వచ్చిన కొడాలి నాని… ఆ తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు. ఇదే సమయంలో కొడాలి అనుచరులు ఆక్రమణల్లో ఉన్న భూములు, సినిమా థియేటర్‌ను స్థానికులు తిరిగి ఆక్రమించుకోవడం గుడివాడ రాజకీయంలో కీలక పరిణామంగా మారింది.మొత్తానికి నలువైపుల నుంచి మాజీ మంత్రి కొడాలిని ఇరుకున పెట్టడమే టార్గెట్‌గా ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనికి స్థానిక ప్రజలు సహకరిస్తుండటం.. మాజీ మంత్రిని ఊపిరి ఆడకుండా చేస్తోంది. ప్రస్తుతానికి రెండు కేసుల్లో ముందస్తు బెయిల్‌ పొందిన కొడాలికి కొంత ఉపశమనం లభించినా, మున్ముందు ప్రభుత్వం తీసుకోబోయే చర్యలే టెన్షన్‌ పెడుతున్నాయంటున్నారు. ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా కూపీలాగుతున్న బియ్యం స్కాంలో కొడాలి పాత్ర ఏంటనేది ప్రభుత్వం ఆరా తీస్తోందంటున్నారు. ఏదైనా సరే కొడాలి డేంజర్‌ జోన్‌లో చిక్కుకున్నారని.. ఆయన బయట పడటం ఎలా అన్నదే పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్