Sunday, February 9, 2025

కులగణన దేశానికే ఆదర్శం..వైఎస్ షర్మిలా రెడ్డి

- Advertisement -

కులగణన దేశానికే ఆదర్శం..వైఎస్ షర్మిలా రెడ్డి

Casting is an ideal for the country..YS Sharmila Reddy

విజయవాడ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం.   ఇదో చారిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి అని ఏపీసీసీ ఛీఫ్ షర్మిలా రెడ్డి కొనియాడారు.  దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ గారి దూరదృష్టికి ఇదొక నిదర్శనం.  తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు. అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం.   ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.   ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతున్నాం.   మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలి.   ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలి.  కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కలు తీయాలి.   మనమెంతో మనకంతా అన్నట్లుగా.. రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాలలో వారి వాటా వారికి దక్కాలి.   జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలి.  గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా..   బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్  ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారు.   బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. బీజేపీ డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారు.   ఇక దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తుంటే..   రిజర్వేషన్లు రద్దుకు కుట్ర అని బీజేపీ తప్పు దారి పట్టిస్తోంది.   బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని..   ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్