Sunday, September 8, 2024

చాయ్ పే చర్చ.. రచ్చ రచ్చ

- Advertisement -

కాంగ్రెస్ కార్యకర్తలను నియంత్రిస్తున్న పోలీసులు

హైదరాబాద్, ఆగస్టు 10: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇద్దరు కాంగ్రెస్ నేతల మధ్య వివాదం నెలకొంది. నియోజకవర్గానికి వచ్చిన ఆ పార్టీ నేత, క్రికెటర్ అజారుద్దీన్ పర్యటనపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండ, మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఆర్ హిల్స్ లో జరిగిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి మాజీ భారత కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ వచ్చారు. ఈయన్ను మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ అభిమానులు అడ్డుకున్నారు. విష్ణు వర్ధన్ రెడ్డి వర్గీయులకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటించడంపై విష్ణువర్థన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

chai-pay-talk-racha-racha
chai-pay-talk-racha-racha

ఈ సందర్భంగా విష్ణువర్థన్ మాట్లాడుతూ.. క్రికెటర్ అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోకి తమకు చెప్పి రాకపోవడం తప్పుగా భావిస్తున్నానని అన్నారు. స్కామ్ లో ఉన్న అజారుద్దీన్ మరోసారి నియోజకవర్గానికి వస్తే, తమకు సమాచారం ఇవ్వాలని, అలా చేస్తే రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తామని అన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే మనసత్వం తనదని అన్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తమ కుటుంబాన్ని అవమానిస్తే సహించేది లేదని అన్నారు. తన తండ్రి పి.జనార్దన్ రెడ్డి 30 సంవత్సరాలు పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. తాను కూడా 16 ఏళ్ల నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఉంటున్నానని చెప్పారు. అలాంటి తనకు కాకుండా వేరే ఒకరికి టికెట్ ఇస్తే సహించేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు.మాజీ ఎంపీకి ప్రోటోకాల్ ఇవ్వలేని మీ పోలీసులు ఏం పని చేస్తున్నారు అంటూ అజారుద్దీన్ తరపున ఉన్న కాంగ్రెస్ కార్యకర్త నిలదీశారు. పోలీసులపై అజారుద్దీన్ అగ్రహం వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. ఈ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులకు అజారుద్దీన్ అనుచరులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరో వైపు  తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హీట్ రోజు రోజు పెరుగుతోంది. టికెట్ ఆశావాహులు తమ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ఓ వైపు ప్రయత్నాలు చేస్తూనే.. మరో వైపు నియోజకవర్గంల్లో యాక్టవ్ అయ్యారు. దీంతో ఇప్పటికే రాజకీయ పార్టీల నేతలు వ్యక్తిగత ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌లో రచ్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి పోటీకి కాంగ్రెస్ పార్టీ నేత, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో పర్యటన చేయడంతో రాజకీయ కాక పీక్స్ కు చేరింది. నియోజక వర్గంలో పర్యటించడమే కాకుండా ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటూ.. అజారుద్దీన్ ప్రకటన చేశారు.దీంతో విష్ణువర్థన్‌ రెడ్డి వర్సెస్ అజారుద్దీన్‌గా రాజకీయం టర్న్ తీసుకుంది. అజారుద్దీన్ తీరుపై విష్ణువర్థన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌తో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందని పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటన చేశారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన అజారుద్దీన్ అనుచరులను విష్ణు వర్గం అడ్డుకుంది. విష్ణు కూడా పార్టీ హైకమాండ్‌పై కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటన అగ్గి రాజేసింది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌ నుంచి పార్టీ టికెట్‌ ఆశించిన అజహరుద్దీన్‌ స్థానికులతో సమావేశమయ్యేందుకు నియోజకవర్గానికి రాగానే నిరసనను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెహ్మత్ నగర్ ప్రాంతంలో అజారుద్దీన్ సభ నిర్వహిస్తున్నప్పుడు కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డి మద్దతుదారులు కొందరు నిరసనకు దిగారు. తాజాగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అజారుద్దీన్‌ పర్యటించడంతో కొత్త వివాదం తెరమీదికి వచ్చింది. ఇది ఒకే పార్టీలోని మరో వర్గాన్ని రెచ్చగొట్టినట్లుగా మారింది.నియోజకవర్గంలోని రెహమత్ నగర్‌లో ఆ పార్టీ నేత, టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తన అనుచరులతో కలిసి ఓ సభను ఏర్పాటు చేశారు. ఆ సభను పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు నిరసన వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు.

తమ నియోజకవర్గంలో మీ ప్రచారం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తారని ప్రశ్నించారు. దీంతో ఇద్దరు నేతల అనుచరుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున అజారుద్దీన్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.జూబ్లీహిల్స్‌ నుంచి అజారుద్దీన్‌ బరిలోకి దిగుతారనే ప్రచారానికి బలం చేకూరుస్తూ.. బుధవారం మొదటిసారి సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ డివిజన్లలో పర్యటించారు. ముందుగా ఎల్లారెడ్డిగూడలో కాంగ్రెస్ అధిష్టానం చేపట్టిన చాయ్‌ పే చర్చ కార్యక్రమంలో కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి కాసేపు ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్‌ నుంచి కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారని ఈ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నిస్తానని అన్నారు. అందులో భాగంగానే తాను ఇక్కడ పర్యటన చేస్తున్నట్లుగా అజారుద్దీన్‌ ప్రకటించారు. మరి అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్