Sunday, September 8, 2024

ఎయిర్‌ ఇండియా సంస్థలను నాశనం చేసింది కాంగ్రెసే..

- Advertisement -

బీఎస్ఎన్ఎల్, హెచ్ఏఎల్చ ఎంటీఎన్ఎల్ , ఎయిర్‌ ఇండియా సంస్థలను నాశనం చేసింది కాంగ్రెసే..
ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో అవి లాబాలలో నడుస్తున్నాయి
పార్లమెంట్ వేదికగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు ప్రధాని మోదీ
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 07
అసలే ఎన్నికల కాలం.. అందివచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ వదిలిపెడతారా? ఛాన్సే లేదు. వేదిక ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చాలా నేర్పరి ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకేముంది..పార్లమెంట్ వేదికగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు ప్రధాని మోదీ. తన వాక్చాతుర్యంతో.. కాంగ్రెస్‌ పార్టీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. తమ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు తిప్పికొట్టడమే కాకుండా.. వాటంతటికీ కారణం ఆ పార్టీనే అని ఫైర్ అయ్యారు.బుధవారం నాడు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నెక్ట్స్ లెవెల్‌లో కామెంట్స్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేసినట్టు.. కాంగ్రెస్‌ పార్టీ తమపై అసత్యప్రచారం చేసిందన్నారు. తానూ స్వతంత్ర భారతంలో పుట్టానని, తన ఆలోచనలు కూడా స్వతంత్రంగానే ఉంటాయన్నారు మోదీ. బానిసత్వానికి తాను పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. బీఎస్ఎన్ఎల్, హెచ్ఏఎల్చ ఎంటీఎన్ఎల్, ఎయిర్‌ ఇండియా సంస్థలను కాంగ్రెస్‌ నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఆరోపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో బీఎస్ఎన్ఎల్ 5 జీ  కూడా తీసుకొచ్చామన్నారు ప్రధాని మోదీ. హెచ్ఏఎల్  కూడా లాభాల్లో నడుస్తోందన్నారు. ఎల్ఐపీ  మూతపడుతుందని కాంగ్రెస్‌ పుకార్లు పుట్టించిందని, కానీ, ఇప్పుడు ఎల్ఐసీ  షేర్‌ ధర రికార్డ్‌ స్థాయిలో ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు రూ.9 లక్షల కోట్ల నుంచి.. రూ.75 లక్షల కోట్లకు పెంచామన్నారు ప్రధాని మోదీ.
ఆ కంపెనీ స్టార్ట్ అవడం లేదు..
ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చురకలంటించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్ పార్టీకి స్టార్టప్‌లాగా యువరాజు రాహుల్ నడిపిస్తున్నారని, అయితే, ఆ కంపెనీ ఎంతకీ స్టార్ట్ అవడం లేదని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్