ఎమర్జెన్సీ డే
జూపాడు బంగ్లా
1975 జూన్ 25న ఇందిరా గాంధీ భారత దేశ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ప్రాథమిక హక్కులను కాలరాసి ఎమర్జెన్సీ విధించినది. అత్యవసర పరిస్థితి గాని,ఒక యుద్ధ కాలంలోనే విధించాలి కానీ ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టు తన ఎంపీగా చెల్లదని, రాజు నారాయణ గెలిచినాడని తీర్పు ఇచ్చినందుకు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. రాష్ట్రపతి సంతకం లేకుండానే ఎమర్జెన్సీ విధించింది. సుమారు రెండు లక్షల మందిని ప్రతిపక్ష నేతలను 1975 నుంచి 1977 మార్చి వరకు జైల్లోనే ఉంచి, చాలామందిని చంపారు. జీవించే హక్కు లేదని కూడా చెప్పారు ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ బలవంతపు కుటుంబ నియంత్రణను పెట్టి డాక్టర్లను హింసించారు. ఢిల్లీలో ఒక మురికి వాడను అక్రమంగా బుల్డోజర్లతో కొట్టించాడు అందుకే భారతదేశము ఈరోజు 25 జూన్ చీకటి అయింది. ఇప్పటి 50 సంవత్సరములు అయింది.నందికొట్కూరులో చౌడేశ్వరి దేవాలయంలో బిజెపి నందికొట్కూరు కోఆర్డినేటర్ చల్లా దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి సీనియర్ లీడర్లు పి రామచంద్రుడు,కృష్ణ యాదవ్, రాజేశ్వర్ రెడ్డి, బొల్లా పిన్ని ఉమామహేశ్వర శర్మ, సంజీవరెడ్డి,హరికృష్ణ, సాంబశివరావు, ఇంకా చాలామంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు