యూపీలో రత్నవరం. మహిళా పోటీ. _______. సూర్యాపేట /నడిగూడెం: ఏప్రిల్ 18(వాయిస్ టుడే బ్యూరో చీఫ్ వై. వి ) సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం రత్నవరం కు చెందిన మాజీ ఎమ్మెల్యే కిసర జితేందర్ రెడ్డి కుమార్తె ఉత్తరప్రదేశ్లోని ,జోన్పూర్ బీఎస్పీ ఎంపీ అభ్యర్థిత్నగా రంగంలో ఉన్నారు. శ్రీ కళా రెడ్డి తండ్రి కీసర జితేందర్ రెడ్డి, కోదాడ సమితి అధ్యక్షునిగా, హుజూర్నగర్ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తల్లి శ్రీమతి లలితమ్మ రత్నవరం సర్పంచిగా ఎన్నికై గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. శ్రీ కళా రెడ్డి ఉత్తర ప్రదేశ్ మాజీ ఎంపీ ధనుంజయ సింగ్ భార్య. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ జోన్ పూర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆమె ఎంపీగా ఎన్నిక కావాలని మండల ప్రజలు రత్నవరం మాజీ సర్పంచ్ పసుపులేటి రామా వినయ వర్ధన్ , సింగల్ విండో మాజీ చైర్మన్ పగడాల ప్రభాకర్ రెడ్డి, సీనియర్ అడ్వకేట్ పగడాల రామచంద్రారెడ్డి,రత్నవరం మాజీ సర్పంచ్ పగడాల పద్మ, ఆకాంక్షిస్తున్నారు.