Sunday, September 8, 2024

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

- Advertisement -

మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం మహిళా విభాగం ఆధ్వర్యంలో కూకట్ పల్లి, శేర్లింగంపల్లి నియోజవర్గాల కార్యవర్గ సభ్యులు, కూకట్ పల్లి ఐడియల్ చెరువు కట్ట పైన ఉన్న రంగనాయక స్వామి ఆలయ  ప్రాంగణంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళలందరూ పాల్గొని బతుకమ్మ పండుగ సంబరాలను అంగరంగ వైభవంగా, అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మహిళ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఆకుల లలిత, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండ దేవయ్య పటేల్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్ వి మహేందర్ పటేల్, గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలు బండారి లత హాజరయ్యారు, ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మన మున్నూరు కాపు సోదరీమణులు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు నన్ను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషం, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒకే చోట కాకుండా ప్రతి సంవత్సరం ఒక్కొక్క నియోజకవర్గంలో చేసుకుంటూ మనలో ఐక్యతను చాటుతున్నందుకు చాలా అభినందనీయం అని కొనియాడారు,

మున్నూరుకాపు మహిళా శక్తి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

Grand Bathukamma celebrations under the auspices of Munnuru Kapu Sangam
Grand Bathukamma celebrations under the auspices of Munnuru Kapu Sangam

అదేవిధంగా కొండ దేవయ్య మాట్లాడుతూ కూకట్పల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి వచ్చిన మహిళ సోదరీమణులందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ హైదరాబాద్ యూత్ విభాగం అధ్యక్షులు దేశెట్టి శివ పటేల్, శేర్లింగంపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ఆకుల విక్రమ్ కుమార్ పటేల్, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఆకుల సుకన్య పటేల్, స్టేట్ మహిళా విభాగం కార్యదర్శి ఉమా రాణి పటేల్ మరియు వారి కార్యవర్గ సభ్యులు అందరు కలిసి ఇంత గొప్పగా నిర్వహించినందుకు అభినందించారు, వీరితోపాటు సీనియర్ సిటిజన్ చింతపంటి భూమయ్య, మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ కమటం పద్మ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జొన్నాల సురేఖ, శేలింగంపల్లి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు తెల్ల సదాలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి ఆకుల రజిత, అండాలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వి ఆర్, కూకట్పల్లి నియోజకవర్గ అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, సెక్రెటరీ జిల్లా జిత్ రావు, ఆకుల కృష్ణ, మూసాపేట్ డివిజన్ యూత్ విభాగం అధ్యక్షులు తూము కొండల్, అకుల నాగేష్, శ్రీనివాస్, కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు,

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్