Sunday, September 8, 2024

టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ లేనట్టే….

- Advertisement -
If there is no teacher recruitment test...
If there is no teacher recruitment test…

టీఆర్టీ నోటిఫికేషన్ ఎప్పుడు

హైదరాబాద్,, ఆగస్టు9, వాయిస్ టుడే: తెలంగాణలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, ఇతర బోర్డులు వేలాది సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, పరీక్షలతో దూసుకెళ్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన విద్యాశాఖలో అయితే టీచర్ల ఖాళీలు కూడా కోకొల్లలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. దీంతో ఎన్నికల ముందు టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (TRT) నోటిఫికేషన్ వస్తుందని అంతా ఆశగా ఎదురు చూశారు. కానీ ఇటీవల కెబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయంతో అంతా అవాక్కాయ్యారు.గతేడాది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)ని నిర్వహించిన ప్రభుత్వం అందులోనే పాసైన వారికి లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఇచ్చారు. అందులో లక్ష మందికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక అంతకు ముందే అర్హత సాధించిన వారితో కలుపుకుంటే కొన్ని లక్షల్లో నిరుద్యోగులు టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇంతలోనే టీచర్ పోస్టుల భర్తీకి అడ్డంకులు ఉన్నాయని పేర్కొంటూ.. మరోసారి టెట్ నిర్వహణకే కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఆగస్టు 16 వరకు అప్లై చేసే గడువు ఇచ్చారు. ఈ మేరకు సెప్టెంబర్ 15న టెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే ఈ టెట్ పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. దీంతో మరో లక్ష మందికి పైగా అభ్యర్థులు టీఆర్టీ కోసం రెడీ కానున్నారు. కొత్తగా టెట్ నిర్వహణతో ఈ ఏడాది ఉపాధ్యాయ భర్తీల నియామకం లేనట్టేనని తేలిపోయింది. మరో రెండు నెలల్లో ఎన్నికల కోడ్ కూడా రానుండటంతో ఇప్పట్లో టీఆర్టీ నోటిఫికేషన్ లేదని అభ్యర్థులు మరింత నైరాశ్యంలో మునిగిపోయారు. అలాగే వచ్చే ఏడాది సమ్మర్‌లో పార్లమెంట్ ఎన్నికల రానున్నాయి. దీంతో వచ్చే ఏడాది చివరి వరకు ఉపాధ్యాయ నియమాకాలు ఉండవని కూడా స్పష్టం అవుతుంది. 2015లో టెట్‌ పరీక్ష నిర్వహించిన ప్రభుత్వం.. 2017లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహించి నియామాకాలు చేపట్టింది. తర్వాత ఏడేళ్లకు, అంటే గతేడాది మళ్లీ టెట్ పరీక్ష నిర్వహించింది. మళ్లీ టెట్‌కే మొగ్గు చూపిన ప్రభుత్వం టీఆర్‌టీ నిర్వహించి ఆరేళ్లు అవుతున్నా నియమాకం చేపట్టడం లేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. మరికొన్ని నెలల్లో వరుసగా ఎన్నికల నోటిఫికేషన్‌లు రానున్న నేపథ్యంలో ఉపాధ్యాయ నియామకాల నోటిఫికేషన్‌ ఇప్పట్లో వెలువడే అవకాశం లేదని భావిస్తున్నారు. నిరుద్యోగులు మాత్రం టీఆర్‌టీ త్వరగా నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్