Friday, October 18, 2024

10 రోజులుగా సోరంగంలోనే …

- Advertisement -

డెహ్రాడూన్, నవంబర్ 21, (వాయిస్ టుడే): ఉత్తరాఖండ్‌లో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన సంగతి తెలిసిందే. ఇందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శిథిలాలు, సొరంగం ప్రవేశ ద్వారం మధ్య దూరం ఎంత ఉందో అధ్యయనం చేయడానికి రెండుసార్లు డ్రోన్ సర్వే చేశారు. కానీ డ్రోన్ శిథిలాల నుంచి 28 మీటర్లకు మించి వెళ్లలేకపోయింది. ఇంతలో డ్రోన్ శిథిలమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) మోహరించిన రోబోటిక్ డ్రోన్ శిధిలాల కారణంగా ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో పైపు డ్రిల్లింగ్ మిషన్‌ ద్వారా మంగళవారం ఉదయం పైపులు నెట్టడం ప్రారంభించారు. లోపల చిక్కుకుపోయిన కార్మికులకు అధికారులు ప్లాస్టిక్ బాటిళ్లలో ఆహారాన్ని పంపిణీ చేశారు. కూలీలు ఆరోగ్యంగా ఉండేందుకు పైపుల ద్వారా కిచెడీ, నారింజ, అరటిపండ్లు, యాపిల్స్ పంపిణీ చేశారు. కిచెడీని ప్లాస్టిక్ బాటిళ్లలో వేసి పైపు ద్వారా కిందకు దించారు. కమ్యూనికేషన్‌ను నిర్వహించడానికి ఛార్జర్‌తో కూడిన ఫోన్‌ను పంపనున్నట్లు అధికారులు తెలిపారు.సోమవారం టన్నెల్ నిర్మాణ నిపుణుల అంతర్జాతీయ బృందం అక్కడికి చేరుకుంది. ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్నాల్డ్ డిక్స్ కూడా రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ 10వ రోజుకు చేరుకోవడంతో అధికారులు స్వయంగా సంఘటన స్థలంలో పర్యవేక్షిస్తున్నారు. ఇక మంగళవారం ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) చార్ ధామ్ మార్గంలో సిల్క్యారా సొరంగం బార్‌కోట్ చివర నుంచి నిలువు డ్రిల్లింగ్ పని చేపట్టనుంది. అందులో కొంత భాగం నవంబర్ 12న కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ చీఫ్ దీనిపై ఈ రోజు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. మొత్తం 1,150 మీటర్లలో టన్నెల్‌కు 970 మీటర్ల మేర యాక్సెస్ రోడ్డును బీఆర్‌ఓ పూర్తి చేసింది. మరోవైపు RVNL విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసింది. దీన్ని జిల్లా యంత్రాంగం తనిఖీ చేస్తోంది. నవంబర్ 26 నాటికి వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అత్యవసర సేవల కోసం శిథిలాల గుండా 150 ఎంఎం స్టీల్ పైపును ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి మూడో ప్రయత్నం జరుగుతోంది.

కార్మికులకు వేడి వేడిగా కిచిడి

కార్మికులకు ఆహార పదార్థాలను పంపేందుకు ఏర్పాటు చేసిన ఆరు అంగుళాల పైపు ద్వారా గత రాత్రి ఎండోస్కోపీ కెమెరాను సొరంగం లోపలికి పంపారు. అనంతరం కొంతమంది కార్మికులతో రెస్క్యూ అధికారులు వాకీ టాకీ లతో మాట్లాడారు. వారిని కెమెరా ముందుకు రావాలని కోరారు. కార్మికులతో మాట్లాడిన వీడియోను అధికారులు మీడియాతో పంచుకున్నారు. వీడియోలో కార్మికులు అందరు సురక్షితంగా ఉండడం కనిపించింది. ‘కెమెరా ముందుకి వచ్చి వాకీ టాకీ ద్వారా మాతో మాట్లాడండి’ అంటూ కార్మికులను ఓ అధికారి అడగడం వినిపించింది. టన్నెల్‌లో చిక్కుకుని నరకయాతన పడుతున్న కార్మికులకు అధికారులు ధైర్యం చెప్పారు. కార్మికులందరూ క్షేమంగా ఉన్నారని, ఓపెనింగ్‌లోకి డ్రిల్ చేసిన స్టీల్ పైపుల ద్వారా ఆహారం, నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.గత పది రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ విఫలం అవుతోంది. దట్టంగా పడిపోయిన పెద్ద పెద్ద రాళ్లు, సహాయక చర్యలకు ఆటంకంగా మారాయి. కార్మికులను రక్షించడానికి చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కార్మికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. వారి గురించి తెలుసుకోవడానికి అధికారులు ఎండో స్కోపీ కెమెరాను పంపించారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మాట్లాడుతూ.. కార్మికులకు పైపుల ద్వారా మొబైల్‌లు, ఛార్జర్‌లను కూడా పంపిస్తామని చెప్పారు. గత పది రోజులుగా టెన్నెల్ చిక్కుకుని నరకయాతన పడుతున్న కార్మికులకు అధికారులు తొలి సారిగా వేడి వేడి ఆహారాన్ని పంపించారు. కార్మికుల వద్దకు ఏర్పాటు చేసిన ఆరు అంగుళాల పైపు ద్వారా కిచిడీ, దాల్ పంపించారు. కూలీలకు వేడి వేడి భోజనం పంపడం ఇదే తొలిసారి అని,  వైద్యులు సిఫార్సు చేసిన ఆహారాన్ని మాత్రమే సిద్ధం చేస్తున్నట్లు  వంట మనిషి హేమంత్ తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇన్‌ఛార్జ్ కల్నల్ దీపక్ పాటిల్ మాట్లాడుతూ.. ఆరు అంగుళాల పైప్ ద్వారా కార్మికులకు ఆహారం, మొబైల్‌లు మరియు ఛార్జర్‌లను పంపగలమన్నారు. చిక్కుకుపోయిన కూలీల ఆరోగ్య పరిస్థితిని బట్టి, వారికి పంపే ఆహార పదార్థాల జాబితాను వైద్యుల సహకారంతో సిద్ధం చేసినట్లు చెప్పారు. అరటిపండ్లు, యాపిల్స్, కిచిడీ, దాలియా వంటి వాటిని పంపేందుకు వీలుగా వెడల్పాటి ప్లాస్టిక్  బాటిళ్లను తెప్పిస్తున్నట్లు కల్నల్ దీపక్ పాటిల్ చెప్పారు. అంతకుముందు రోజునేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అన్షు మనీష్ ఖుల్కో సహాయక చర్యలపై మాట్లాడారు. మొదటి లైఫ్‌లైన్‌నుకు అంతరాయం జరిగితే ఏం జరుగుతుందనే ఆందోళన ఉండేదని, ఇప్పుడు రెండో లైఫ్‌లైన్‌ను ఏర్పాటు చేయడంతో భయం లేదన్నారు.కార్మికులను రక్షించడానికి సరికొత్త శక్తితో పనులు మొదలు పెడతామన్నారు. రెండో లైఫ్ లైన్ ఏర్పాటుతో కార్మికుల్లో ఆందోళన తగ్గిందని, వారిలో ఆనందం నెలకొందని చెప్పారు. అంతకు ముందు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)కి చెందిన రెండు రోబోటిక్స్ యంత్రాలు ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని చూసినా ఫలితం లేకపపోయింది. సొరంగం లోపల పొరలు, రాళ్లు వదులుగా ఉన్నాయని, రోబోటిక్ ఆపరేషన్ విజయవంతం కాలేదని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్