- Advertisement -
కూలిన ఇళ్ల స్థలంలో ఇందిరమ్మ ఇళ్లు
Indiramma houses on the site of demolished housesమహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం, రావిరాల గ్రామంలో వరద ప్రభావిత,బాధితు లను పరామర్శించి, గ్రామంలోని ప్రాంతాలను, రాష్ట్ర పంచాయ తీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షే మ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పరిశీలించి, వారికి మనోధర్యమిచ్చారు. ఆమె వెంట మహబూబాబాద్ పార్లమెం టు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ ఆర్ కేకన్,తదితరులు వున్నారు.
మంత్రి మాట్లాడు తూ గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సా మాన్య ప్రజలు ఇబ్బందులు పడ కుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ఎవరు అధైర్యపడవలసిన అవసరం లేదని, వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్ల స్థానంలో ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు.జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కలెక్ట రేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన సమస్యలను వెంటవెంటనే పరిష్కరించడం జరు గుతుందని ఆమె తెలిపారు.
- Advertisement -




