Sunday, September 8, 2024

కమనీయం – రమణీయం – మైసూరు దసరా ఉత్సవం

- Advertisement -

కర్ణాటక రాష్ట్రానికి రాజధాని బెంగుళూరు అయితే , కర్ణాటక  సాంస్కృతిక రాజధాని మాత్రం మైసూరు అనే చెప్పాలి. నిజానికి , విజయదశమి పండుగ వస్తోందంటే చాలు , కర్ణాటక రాష్ట్రం అంతా పండుగే , మరీముఖ్యంగా , మైసూరు నగరం , ఆ ఉత్సవాలకు పెట్టింది పేరు . కర్ణాటక రాష్ట్ర చరిత్ర, సంస్కృతి , సంప్రదాయాలను మైసూరు లో జరిగే దసరా ఉత్సవాలు ప్రతిబింబిస్తాయి.

గత నాలుగు దశాబ్దాలుగా మైసూరు దసరా ఉత్సవాలు రంగ రంగ వైభవం జరుగుతున్నాయి . ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తం గా మైసూరు దసరా ఉత్సవాలు అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి . 1399 లో మైసూరు అరసు వంశస్థులు మైసూరు మహా సామ్రాజ్య చరిత్రను చాటి చెప్పడానికి శ్రీకారం చుట్టారు. రాజ వంశానికి చెందిన యదురాయ , కృష్ణ రాయ , మైసూరు దసరా ఉత్సవాలు ఘనం గా నిర్వహించారు . విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత కన్నడ రాష్ట్రం వాడయార్ల పాలన లోకి వెళ్ళిపోయింది. క్రీ . శ . 1610 లో మొదటి సారిగా దసరా ఉత్సవాలు ప్రారంభించారు . 1659 లో అప్పటి దొడ్డ దేవరాజు ఆలయాన్ని పునర్నిర్మించి మెట్ల మార్గాన్ని ప్రారంభించారు . అప్పటినుంచి , మొదలైన ఉత్సవాలు నేటికీ విజయవంతంగా జరుగుతున్నాయి. ఏ ఉత్సవాల్లో మైసూరు లో కొలువై ఉన్న శ్రీచాముండీ అమ్మ వారికి , 12 రోజులు ఆభరణాలు అలంకరించి ఉత్సవాలు చేస్తారు. 1905 వ సంవత్సరం లో రాజభవనం లో దసరా రోజున రాజదర్బార్ ఏర్పాటు చేసే సంప్రదాయం మూడో కృష్ణ రాజా వడయార్ ప్రారంభించారు. ఆ తర్వాత అది ఆచారం గా మారిపోయింది . మైసూరు దసరా అంటే అట్టాహాసం గా జరిగే రాజప్రాకారపు ఊరేగింపులు మాత్రమే కాదు – అవి మన సంస్కృతి , సంప్రదాయాలు, సాహిత్యం, ఇతిహాసాలు, కళలు, కలలు – అన్నీ కలబోసిన ఒక సంబరం – ఒక జాతి సాంస్కృతిక సంపద- అవ్వన్నీ కలగలిపి వీక్షించడం అనేది ఒక మధురమైన అనుభూతి – చూసేవాళ్లకు కన్నుల పండుగ.

Kamaniyam - Ramaniyam - Mysore Dussehra festival
Kamaniyam – Ramaniyam – Mysore Dussehra festival

మైసూర్ మహారాజులు తమ ఇంటి దేవత గా చాముండి దేవి ని పూజిస్తారు, ఆరాధిస్తారు .

దసరా ముందు తొమ్మిది రోజుల పాటు శక్తీ మాతకు పూజలు చేస్తారు. దసరా రోజున మైసూరు మహారాజ ప్యాలస్ లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానం గా ప్రకాశిస్తుంటుంది . మైసూరు మహారాజులు నివసించు ప్యాలస్ లోనే ఈ ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులన్నీ భద్రపరుస్తారు . మహారాజ ప్యాలస్ లో ఉండే అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని , దసరా వేడుకలకి పది రోజులు పాటు ప్రజలకు దర్శించే అవకాశం కల్పిస్తారు .

మైసూరు దసరా ఉత్సవాలను తిలకించడానికి ప్రపంచ వ్యాప్తం గా పర్యాటకులు మైసూరు వస్తారు . శ్రీ చాముండి అమ్మవారిని , దసరా నవరాత్రుల సందర్భం గా తొమ్మిది అవతారాలలో ప్రత్యేకముగ అలంకరించి పూజలు చేస్తారు . మైసూరు మహారాజులు తమ కులదైవమైన చాముండేశ్వరి దేవిని అలంకరించి, ఆరాధించి, ఏనుగులమీద ఊరేంగించడం అనేది ఇక్కడ ఆచారం. ఆ సమయం లో మైసూరు మహారాజ ప్యాలస్ ప్రత్యేకమైన అలంకరణలతో వెలిగిపోతుంటుంది. రాజు గారి ఆయుధ పూజ, ఏనుగుల అలంకరణ , నవరాత్రుల్లో , తొమ్మిదో రోజున మైసూరు రాజవంశానికి చెందిన రాజ ఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేయడం ఆకట్టుకుంటుంది .

వందల ఏళ్ల క్రితం మైసూరు రాజ కుటుంబం ప్రారంభించిన ఈ వేడుకలు – ఇప్పటికీ ఆంతే ఉత్సాహం తో , ఆంతే భక్తి శ్రద్ధలతో , ప్రతి సంవత్సరం వైభవోపేతంగా జరుగుతున్నాయి. మొత్తం గా ఈ పదిరోజుల పండుగ ను వీక్షిస్తానికి ప్రపంచం వ్యాప్తం గా లక్షలాది మంది పర్యాటకులు మైసూరు సందర్శిస్తారు . నెలరోజుల ముందే మైసూరు పట్టణం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది . పర్యాటకులు ఈ దాసరా రోజుల్లో మైసూరు ప్రాంత సందర్శన ఒక మధుర జ్ఞాపకం గా మిగులుతుంది- ప్రతి పర్యటకుడికి భూతల స్వర్గం లో ఉన్న అనుభూతి కలుగుతుందన్న మాటలో ఎలాంటి అతిశయోక్తి లేదు . – సత్య కేశరాజు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్