చేవెళ్లలో కేవీఆర్ గెలుపు పక్కా
రంగారెడ్డి
ఈ సారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి. ఆమె రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్సింగ్ లోగల రాజపుష్ప, ఫ్రంట్ లైన్, బీఆర్సీ రెసిడెన్సీల్లో నిర్వహించిన గేట్ కమ్యూనిటీ మీటింగ్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేవెళ్ల ప్రజలంతా కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారిని మరోసారి పార్లమెంట్ కు పంపాలని నిర్ణయించుకున్నారని అన్నారు. ఈ సారి ఆయనను రెండు లక్షల మెజార్టీ రాబోతోందని సంగీతారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మే13న ప్రతీ ఒక్కరూ తరలివచ్చి పోలింగ్ లో పాల్గొనాలని ఆమె కోరారు. దేశాభివృద్ధికి ఎంతోపాటుపడుతున్న నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేయడంలో ప్రజలంతా కలిసి రావాలని ఆమెపిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అగ్రరాజ్యంగా తీర్చిదిద్దేందుకే భారతీయ జనతా పార్టీ వికసిత్ భారత్ పేరుతోప్రజలందరి మద్దతు కోరుతోందని ఆమె అన్నారు. ఈకార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
చేవెళ్లలో కేవీఆర్ గెలుపు పక్కా

- Advertisement -
- Advertisement -