Sunday, September 8, 2024

శిశువుల తారుమారు.. మరోసారి జరగకుండా హామీ

- Advertisement -

మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో

manipulation-of-babies-guaranteed-not-to-happen-again
manipulation-of-babies-guaranteed-not-to-happen-again

మహబూబాబాద్: మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రి లో శిశువులు  తారు మారు కావడం  కలకలం సృష్టించింది. ఎస్.ఎన్.సి.యు సిబ్బంది సుమిత్ర బాబు ను సునిత కు అప్పగించారు.గంట తర్వాత సుమిత్ర కుటుంబ సభ్యులు గుర్తించి వైద్య సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. జరిగిన తప్పు ను వైద్య సిబ్బంది తెలుసుకొని సునిత దగ్గరి బాబును సుమిత్ర కు అప్పగించి మరోసారి ఈ విధంగా జరగకుండా చూస్తామని హామీని ఇవ్వడంతో వివాదం సద్దు మణిగింది.

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన భూక్య సుమిత్రకు  జూలై 31వ తేదీన మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతి అయింది. పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబు కు పసరికలు కావడంతో ఎస్.ఎన్.సి.యు లోని బాక్స్ లో ఉంచారు. కేసముద్రం మండలం దస్రు తండా చెందిన సునిత ఈ నెల 4 వ తేదీన ప్రసూతి కాగా పాపకు జన్మనిచ్చింది. పాప కు శ్వాస సరిగా ఆడకపోవడం తో ఎస్.ఎన్. సి.యు లోని బాక్స్ లో ఉంచారు. బాబు కు ఫీడింగ్ ఇవ్వడం కోసం ఎస్.ఎన్.సి.యు లో నుండి సుమిత్ర బాబు ను సునిత కు ఇచ్చారు. బాబు ని తీసుకున్న సునిత కుటుంబ సభ్యులు వార్డుకు వచ్చారు. కొంత సమయం తర్వాత వార్డు లోని కొంత మంది మీకు పాప పుట్టింది కదా, బాబు ఎక్కడ నుండి వచ్చాడు అని ప్రశ్నించారు. ఈ విధంగా ప్రశ్నిస్తున్న సమయంలో సునిత వద్ద ఉన్న బాబు ను అమ్మమ్మ  చూసి బాబు కు ఉన్న కాటుక బొట్టును నేనే పెట్టిన.. ఇతడు మా బాబే మీ దగ్గరికి ఎలా వచ్చాడు అని వారితో, సిబ్బంది తో వాగ్వాదానికి దిగింది. దీంతో తప్పును తెలుసుకున్న సిబ్బంది బాబును సుమిత్రకు అప్పగించారు. మరోసారి ఇలా జరగకుండా చూస్తామని హామీని ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమనిగింది. విషయం తెలుసుకున్న బ్లూ కోట్స్ సిబ్బంది వెంటనే హాస్పిటల్ కు చేరుకుని విచారణ చేపట్టారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్