- Advertisement -
మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క
Minister Sitakka participated in face-to-face program with ministers
హైదరాబాద్
మంగళవారం జరిగిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గోన్నారు. కార్యకర్తలు , సామాన్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులో కొన్నింటిని అక్కడిక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ నా వంతు లో భాగంగా మంత్రులతో ముఖాముఖి పాల్గొంటున్నాను. ప్రజలు తమ సమస్యలను ప్రజా భవన్, మంత్రుల కార్యాలయాలకు వెళ్లి చెప్పుకుంటున్నారు. గాంధీ భవన్ లో జరిగే ముఖా ముఖి కార్యక్రమం ద్వారా ప్రజలు , కార్యకర్తలు తమ సమస్యలు చెప్తున్నారు. జర్నలిస్టు సోదరుడు సుభాష్ అకాల మరణం బాధాకరం. ప్రభుత్వ, రాజకీయ కార్యక్రమాల్లో సుభాష్ చురుగ్గా పాల్గొనే వారు. చనిపోయిన సుభాష్ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ, నివాళాలు అర్పిస్తున్నాను. ఈ సమయంలో సుభాష్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.
- Advertisement -