- Advertisement -
బుద్దా వెంకన్న తో ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు భేటీ
MP Kalishetty Appalanaidu met Buddha Venkannaవిజయవాడ
ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్ ఛార్జి బుద్దా వెంకన్న ను నివాసానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ బుద్దా వెంకన్న టీడీపీ కోసం ఎంతో పని చేశారు. ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జిగా టీడీపీని బలోపేతం చేశారు. పని చేసే నాయకులను గుర్తించి చాలా ప్రోత్సహించారు. అనేక సందర్భాల్లో నాకు కూడా అండగా నిలిచి, అనేక సూచనలు చేశారు. అమ్మవారి దర్శనానికి ఈరోజు విజయవాడ వచ్చాను. బుద్దా వెంకన్న ను ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. గత అరాచక పాలనకు నిరసనగా తీవ్రంగా పైట్ చేసిన వ్యక్తి బుద్దా వెంకన్న. చంద్రబాబు నాయుడు ని దైవంగా భావించి.. ప్రతిరోజూ కొలుస్తారు. నారా కుటుంబంపై ఎవరు మాట్లాడినా సహించలేని వ్యక్తి బుద్దా వెంకన్న. గతంలో నోళ్లు పారేసుకున్న వైసీపీ నాయకులపై సవాళ్లు విసిరి దమ్ముగా వెళ్లిన నేత ఆయన. పార్టీ అంటే అంకితభావంతో పనిచేసే వ్యక్తి బుద్దా వెంకన్న. తప్పకుండా ఆయన సేవలను అధినేత ఉపయోగించుకుంటారని అన్నారు
- Advertisement -




