- Advertisement -
పత్తికొండలోపల్లె పండుగ కార్యక్రమం శ్రీకారం
Pattikonda Lopalle festival program started
30లక్షల సీసీ రోడ్లకు భూమి పూజ
పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు
పత్తికొండ
పత్తికొండ మండలం చక్రాల గ్రామం అలాగే దూదేకొండ గ్రామంలో మరియు పత్తికొండ పట్టణం నందు షాధిఖాన రోడ్ నందు పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్. చక్కరాళ్ళ గ్రామంలో నిర్మించిన సిసి రోడ్డుని ప్రారంభించారు. అలాగే చెక్కరాళ్ల, దూదేకొండ,పత్తికొండ నందు దాదాపుగా 30 లక్షల సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. చెక్కరాళ్ల గ్రామం లో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన చేయాలని ఉపాధ్యాయులకు తెలియజేశారు. విద్యార్థుల తో పాటు డిజిటల్ క్లాసులను వీక్షించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతుందనే విశ్వాసం ఉందని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామాలకు నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా దోచేశారన్నారు. కుటుంబ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణాలు జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కులాయిలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఓ ఆర్ డి నరసింహులు, ఏపీఓ వెంకటేశ్వర్లు, జిలాన్ పత్తికొండ సర్పంచ్ కొమ్ము దీపిక, ఎంపిటిసి రాజు, మీరు హౌసేన్ ,టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు
- Advertisement -