- Advertisement -
ఇసుక మాయంపై పోలీసులు కేసులు నమోదు చేయాలి
Police should register cases on sand miningఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో మాయమైన ఇసుకపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి స్పందించారు. వైసిపి నాయకులు కార్యకర్తలతో ఇసుక డంపు యార్డును పరిశీలించారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇసుక మాయం వెనుక రాజకీయ అండదండలు ఉన్నాయని అన్నారు. దాదాపు 600 పైగా మెట్రిక్ టన్నుల ఇసుక మాయమైతే పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు. 20 నుండి 30 లారీలలో తరలిస్తే తప్ప అన్ని టన్నుల ఇసుక ఎలా మాయం అవుతుంది. సంభధిత అధికారులు స్టేషన్కు వెళ్తే ఫిర్యాదులు పోలీసులు ఎందుకు తీసుకోవడం లేదు. సీసీ ఫుటేజ్ లో పరిశీలించి దీని వెనుక ఉన్న ఆ రాజకీయ నాయకుడు ఎవరో పోలీసులు కనిపెట్టాలని అన్నారు.
- Advertisement -




