- Advertisement -
పండగల నేపధ్యంలో రాజకీయ ర్యాలీలు మానుకోవాలి-మంత్రి పొన్నం ప్రభాకర్
Political rallies should be avoided due to festivals-Minister Ponnam Prabhakarహైదరాబాద్
వినాయక చవితి సందర్భంగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గణేష్ నిమజ్జనాల సందర్భంగా రాజకీయాల ర్యాలీలకు అనుమతి లేదు. గణేష్ ఉత్సవాల టైంలో మూడు కమీషనరేట్ల పరిధిలో ఎవ్వరు రాజకీయాలు మానుకోవాలి. రాజకీయాలకు అనేక వేడుకలు ఉంటాయి. ముస్లీం పండుగలు వరుసగా వచ్చిన సందర్భంలో రాజకీయాలు చేయొద్దు. గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరగాలనేది ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. రెచ్చ గొట్టే విధంగా ఎవ్వరు మాట్లిడినా చట్ట పరంగా చట్టాలుంటాయి. సంఘ విద్రోహ చర్యల మీద కఠినంగా ఉండాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు. గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు కూడా సహకరించాలని అన్నారు.
- Advertisement -




