ఇంకా చిక్కని చిరుత

- Advertisement -

ఇంకా చిక్కని చిరుత

Still cheetah din't get Caught

రాజమండ్రి
మూడు రోజులుగా తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ ప్రాంతంలో సంచరిస్తూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి ఫారెస్ట్ అధికారులకు చిక్కుతుందా లేదా అనేది చర్చనీయంగా మారింది. తూర్పుగోదావరి,కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బృందం ఈ చిరుతను పట్టుకోవడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నారు. అయితే గురువారం ఆ చిరుత కదలికలు ఉన్న కడియపులంక చెక్కపల్లి వారి వీధి సమీపంలో గల నర్సరీ వద్ద బోన్లు ఏర్పాటు చేసి దానికి ఆహారంగా మేక,పంది పిల్లలను ఉంచారు. గత మూడు రోజుల నుండి ఆ చిరుత ఆహారంగా ఏ జంతువును తిన్న ఆనవాళ్ళు కనబడలేదు. అందువల్ల ఆహారం కోసం ఈ బోనులోకి వచ్చి చిక్కుతుందనే అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడ నుండి తప్పించుకుంటే ఆ చిరుతను పట్టుకోవడం చాలా కష్టమవుతుంది.ఇప్పటికే దివానచెరువు, కడియం ప్రాంతలలో పాతిక రోజులుగా అధికారులు వేసిన ఎత్తుగడలను చిత్తు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular