- Advertisement -
ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది
The government works according to the aspirations of the people
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీస్కెళ్లాలి
క్రమశిక్షణ అనేది చాలా కీలకం.. క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదు
మెదక్ జిల్లా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ అక్టోబర్ 15
రాష్ట్రము లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.మంగళవారం గాంధీ భవన్ లో జరిగిన మెదక్ జిల్లా నేతల సమావేశంలోపాల్గొని ప్రసంగించారు.ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మనం ముందున్నం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అద్భుతమైన పాలన చేస్తున్నారన్నారు.ఇందిరమ్మ ఇళ్ల ఇస్తున్నాం.. ఉద్యోగాల కల్పన చేసాము .బస్ లలో ఉచిత సౌకర్యాలు కల్పించాం. 2 లక్షల రూపాయల రుణ మాఫీ, 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల కరెంట్, స్కిల్ యూనివర్సిటీ, అనేక కొత్త విధానాలు అమలు చేస్తున్నామన్నారు.మీరంతా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీస్కెళ్లాలని పిలుపు నిచ్చారు.ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణాంగ ఉండేలా కృషి చేయాలి..క్షేత్ర స్థాయి లో మరింత లోతుగా పని చేయాలి. రాబోయే ఎన్నిలకలో మనం మరింత గట్టిగా పని చేయాలి.స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు…నియోజకవర్గ నాయకులు కలిసికట్టుగా పని చేయాలి టీపీసీసీ అధ్యక్షులుగా నాకు ఒక పెద్ద బాధ్యత ఇచ్చారు.. నియోజక వర్గ ఇంచార్జ్ లు మంచిగా కలుపుకొని పోవాలి మెదక్ పూర్వ జిల్లాలో మనం మరింత గట్టిగా కృషి చేయాలి నియోజక వర్గ ఇంచార్జ్ భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పని చేసి మంచి ఫలితాలు తేవాలి.రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలి.. క్రమశిక్షణ అనేది చాలా కీలకం.. క్రమశిక్షణ ఉల్లంగిస్తే ఊరుకునేది లేదు మెదక్ జిల్లా లో మంచి ఫలితాలు సాధించే దిశగా పని చేయాలి.
- Advertisement -