- Advertisement -
సాగర్ కాలువలో ముగ్గురు గల్లంతు ఒక మృతదేహం లభ్యం
Three dead bodies were found in the Sagar canalఖమ్మం
ఖమ్మం దానవాయిగూడెం ఎన్ఎస్పి కాలువలో మణుగూరుకు చెందిన ముగ్గురు గల్లంతు అయ్యారు. దానవాయిగూడెం సబ్ జైల్లో స్నేహితుడిని చూసేందుకు మణుగూరుకు చెందిన నలుగురు యువకులు వచ్చారు. మంగళవారం రాత్రి సాగర్ కాలువ వద్దకు వెళ్లారు. బుధవారం ఉదయం స్నేహితుడు వెంకటేశ్వర్లు లేచి చూసేసరికి కాలవపై దుస్తులు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గల్లంతైన యువకులు మణుగూరు మండలం శివలింగా పురంకు చెందిన చల్ల రమేష్, ప్రసాదు, బండారు భరత్ గుర్తించారు. గల్లంతైన ముగ్గురిలో భరత్ మృతదేహం లభ్యం అయింది. మిగతా ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
- Advertisement -




