Friday, April 11, 2025

ఆ ఏడు వేలకోట్లు ఎవరి అకౌంట్‌లోకి వెళ్లాయి

- Advertisement -

ఆ ఏడు వేలకోట్లు ఎవరి అకౌంట్‌లోకి వెళ్లాయి
బిఆర్‌ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం
మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ప్రశ్నించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్ ఏప్రిల్ 19
కరెంట్ కోతలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ  రైతు బంధు కోసం ఏడు వేల కోట్లు రెడీగా ఉంచామని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్ధం చెప్పారని, ఆ ఏడు వేలకోట్లు ఎవరి అకౌంట్‌లోకి వెళ్లాయని భట్టి ప్రశ్నించారు. బిఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై అన్ని అబద్ధాలే చెప్పారని, ప్రస్తుతం బిఆర్‌ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని పేర్కొన్నారు. రైతులలో 93 శాతం మందికి రూ. 5500 కోట్లు రైతు బంధు విడుదల చేశామని భట్టి ప్రకటించారు. మహాలక్ష్మి స్కీం ద్వారా మహిళలకు ఫ్రీజర్నీ కల్పించామని, ఇప్పటికే ఫ్రీ టికెట్ల కింద ఆర్‌టిసి సంస్థకు రూ.1020 కోట్లు ఇచ్చామని, మధ్యాహ్న భోజనానికి మహిళా సంఘాలకు నిధులిచ్చామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలకు భట్టి సవాల్ విసిరారు. ధనిక రాష్ట్రంలో కొందరే లాభపడ్డారని, ధనిఖ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందని బిఆర్‌ఎస్సోళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారంలోకి రాగానే శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలు వివరించామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్