తెలంగాణ బడ్జెట్ 2.72 లక్షల కోట్లు ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ
హైదరాబాద్, ఫిబ్రవరి 10
రాష్ట్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టను న్నది.
ఈ సారి సుమారు రూ.2.72 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రతిపాదించ వచ్చని తెలుస్తున్నది. శనివారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ఆవరణలో జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలుపనున్నారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూ టీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టను న్నారు. మరోవైపు శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు బడ్జెట్ ప్రతిపాదనలను చదవనున్నారు.
తిరిగి సోమవారం అసెంబ్లీ, మండలిలో వేర్వేరుగా బడ్జెట్ అంశాలపై చర్చ జరుగనున్నది. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు లేకుండా.. కేవలం ఖర్చులు మాత్రమే ఉంటాయని తెలుస్తున్నది.
ఏటా సాధారణంగా జరిగే.. ప్రభుత్వ కార్యకలాపాలు, శాఖల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ పంపిణీ వంటివి మాత్రమే ఉంటాయని సమాచారం. లోక్సభ ఎన్నికల అనంతరం మళ్లీ జూన్ లేదా జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది..



